News August 31, 2025

కర్నూలు: ‘ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి’

image

కర్నూలు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగులు వేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో “ఓపెన్ ఫోరం” కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు పౌరులు ఎల్‌ఆర్‌యస్, నిర్మాణ అనుమతులు, అక్రమ నిర్మాణాలపై అర్జీలు సమర్పించారు.

Similar News

News September 3, 2025

రూ.కోటి విరాళం ప్ర‌క‌టించిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు విగ్ర‌హ నిర్మాణానికి టీజీవీ సంస్థ‌ల త‌రఫున‌ రూ.కోటి విరాళం ఇస్తున్న‌ట్లు మంత్రి టీజీ భ‌ర‌త్ ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తిలో ఏపీ ప్ర‌భుత్వం, పొట్టి శ్రీరాములు మెమోరియ‌ల్ ట్ర‌స్ట్‌ సంయుక్తంగా 58 అడుగుల కాంస్య విగ్ర‌హంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటు చేయ‌నున్నాయి. వీటి నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం మంత్రి భ‌ర‌త్ ఈ విరాళం ప్ర‌క‌టించారు.

News September 3, 2025

గణేశ్ నిమజ్జనం సజావుగా సాగేందుకు ప్రటిష్ఠ చర్యలు చేపట్టండి: ఎస్పీ

image

కర్నూలులో గురువారం నిర్వహించనున్న గణేశ్ నిమజ్జనం సజావుగా జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. బుధవారం కర్నూలు టౌన్ డీఎస్పీ బాబు ప్రసాద్‌తో కలిసి ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

News September 3, 2025

ఉద్యోగం కోసమే తండ్రిని చంపాడా?

image

కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో తండ్రి రామాచారిని కుమారుడు వీరస్వామి చారి <<17598178>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. రామాచారి ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం కోసం తండ్రిని కుమారుడు హతమార్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేపట్టారు.