News August 31, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(ఆగస్టు 31, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.48 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
✒ ఇష: రాత్రి 7.44 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News September 3, 2025
కోహ్లీకి ఇంగ్లండ్లో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి!

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఇంగ్లండ్లో ఫిట్నెస్ టెస్ట్ పూర్తయినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. మిగతా ప్లేయర్లందరికీ ఇండియాలోనే టెస్టులు జరగగా, ఆయనకు మాత్రమే విదేశాల్లో నిర్వహించారని పేర్కొన్నాయి. ఇటీవల రోహిత్ శర్మ, గిల్, సిరాజ్, బుమ్రా తదితర ఆటగాళ్లకు బెంగళూరులో ఫిట్నెస్ టెస్టులు <<17575424>>జరిగిన<<>> సంగతి తెలిసిందే. ఈ నెలలో నిర్వహించే సెకండ్ ఫేజ్లో మిగతా ప్లేయర్లనూ పరీక్షించనున్నారు.
News September 3, 2025
అమరావతి.. ఆ 1,800 ఎకరాల సేకరణకు నిర్ణయం

AP: అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32వేల ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్న 1,800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని CRDA నిర్ణయించింది. ల్యాండ్ పూలింగ్ కింద అప్పగించాలని కోరినా రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ అక్విజిషన్ (భూ సేకరణ) చేయాలని డిసైడ్ అయింది.
News September 3, 2025
‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశానికి చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్

TG: CM రేవంత్ ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున, గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1000 చొప్పున ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తోంది.