News August 31, 2025

భారత డ్రోన్స్‌ను US, చైనా కనిపెట్టలేవు: రాజ్‌నాథ్

image

దేశంలో ‘న్యూ టెక్నలాజికల్ రెవల్యూషన్‌’కు ఇండియన్ డ్రోన్స్ సింబల్‌గా మారాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్‌ యుద్ధాల్లో డ్రోన్లదే కీలక పాత్ర అని అభిప్రాయపడ్డారు. ‘నేటి యువత కంపెనీ ఏర్పాటు చేయడం కాదు.. సరికొత్త ఆలోచనలతో డిఫెన్స్ సెక్టార్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఇండియన్ డ్రోన్స్ ఎగిరినప్పుడు.. అమెరికా, చైనా కూడా వాటిని కనిపెట్టలేవు. ఇది చాలా గొప్ప విషయం’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News September 3, 2025

బంగారం ధరలు ALL TIME RECORD

image

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.880 పెరిగి రూ.1,06,970కు చేరింది. కాగా 9 రోజుల్లో రూ.5,460 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.800 ఎగబాకి రూ.98,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.900 పెరిగి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News September 3, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

☛ ఈ నెల 5న మాదాపూర్ హైటెక్స్‌లో 5వేల మంది గ్రామ పాలన అధికారులకు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్
☛ 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టుల భర్తీకి వారం రోజుల్లో నోటిఫికేషన్
☛ గిరిజన గ్రామాల్లో బీటీ రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.700 కోట్లు మంజూరు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
☛ చెరువులు, పార్కుల ఆక్రమణ/కబ్జాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు అందుబాటులోకి హైడ్రా టోల్ ఫ్రీ నంబర్ 1070

News September 3, 2025

అదే నా బిగ్గెస్ట్ డ్రీమ్: రింకూ సింగ్

image

భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే తన బిగ్గెస్ట్ డ్రీమ్ అని రింకూ సింగ్ వెల్లడించారు. ‘అవకాశం వస్తే అన్ని ఫార్మాట్లలో రాణించగలననే నమ్మకం ఉంది. టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ నాకు ఇష్టం ఉండదు. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం కావాలనుకోవట్లేదు. నేను సిక్సులు కొడితే ఫ్యాన్స్ ఇష్టపడతారని తెలుసు. కానీ రంజీల్లో కూడా నా సగటు (55) బాగుంది. రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.