News August 31, 2025
US వీసా ఫీజు పెంపు.. ట్రావెల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం

US కొత్తగా తీసుకొచ్చిన వీసా ఇంటెగ్రిటీ ఫీజు ట్రావెల్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం చూపనుంది. దీని ప్రకారం ట్రావెలర్స్ $250(రూ.22వేలు) అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టోటల్ వీసా కాస్ట్ $442(రూ.39 వేలు)కు చేరనుంది. ఇది ఇండియా, చైనా, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల వారికి భారంగా మారనుంది. అటు USకు వచ్చే టూరిస్టుల సంఖ్య మరింత తగ్గిపోయి, ఆదాయం పడిపోతుందని అక్కడి ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
తీవ్ర అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారినట్లు APSDMA తెలిపింది. అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
News September 3, 2025
గణపతి నిమజ్జనాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: TG పోలీస్

❃ విగ్రహం ఎత్తును బట్టి నిర్దేశించిన రూట్లలో మాత్రమే శోభాయాత్ర నిర్వహించాలి.
❃ నిర్ణీత ప్రాంతాల్లోనే నిమజ్జనం చేయాలి.
❃ పోలీస్, మున్సిపల్/పంచాయతీ సిబ్బంది సాయం తీసుకోవాలి.
❃ చెరువులు, నీటి కుంటల్లోకి దిగొద్దు. భారీ విగ్రహాల కోసం క్రేన్ వాడాలి.
❃ వాహనాలను నడిపేందుకు నిపుణులైన డ్రైవర్లను నియమించుకోవాలి.
News September 3, 2025
GSTలో నేడు మార్పులు.. అమలు ఎప్పుడంటే?

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సవరించే శ్లాబులు, రేట్లను కేంద్రం ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది. రేట్లు ఇలా మారే అవకాశం ఉంది.
*టెక్స్టైల్ ఉత్పత్తులు, ట్రాక్టర్లపై 12% నుంచి 5%
*చెప్పులు, డైరీ ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్, హ్యాండ్ బ్యాగ్స్, ప్రాసెస్డ్ కాఫీ 12% నుంచి 5%
*ఏసీలు, టీవీలు, సిమెంట్ 28% నుంచి 18%
*1500 cc లగ్జరీ కార్లు, 300 cc బైకులు, పొగాకు ఉత్పత్తులు 28% నుంచి 40%