News April 2, 2024

నేటితో వీరి రాజ్యసభ పదవీకాలం ముగిసింది..

image

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇవాళ్టితో ముగిసింది. వారిలో AP నుంచి ప్రభాకర్‌రెడ్డి, రమేశ్, కనకమేడల రవీంద్ర, TG నుంచి రవిచంద్ర, లింగయ్య, జోగినపల్లి సంతోష్ ఉన్నారు. వీరి స్థానంలో APలో YCP నుంచి మేడా శివనాథ్, సుబ్బారెడ్డి, బాబూరావు, TGలో రేణుకా చౌదరి, అనిల్ యాదవ్(INC), వద్దిరాజు రవిచంద్ర(BRS) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Similar News

News April 21, 2025

విశాఖ, తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లు

image

AP: ఆహారాలు, నిత్యావసరాల్లో కల్తీని గుర్తించేందుకు రాష్ట్రంలో రెండు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ల్యాబ్ విశాఖ KGHలో ఇప్పటికే సిద్ధమైంది. మరోటి తిరుమలలో ఏర్పాటు కానుంది. ఒక్కో ల్యాబ్ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. కేజీహెచ్ ల్యాబ్‌కు సంబంధించి ఇప్పటికే భవన నిర్మాణం పూర్తయింది. యంత్రాలనూ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది.

News April 21, 2025

16,347 పోస్టులు.. మరో UPDATE

image

APలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి కొత్త సిలబస్ ప్రకారమే విద్యాశాఖ పరీక్షలు నిర్వహించనుంది. 3 నుంచి పదో తరగతి స్థాయిలోనే ఆబ్జెక్టివ్ విధానంలో 160 ప్రశ్నలు ఉంటాయి. నెగటివ్ మార్కింగ్ ఉండదు. DSCకి 80%, టెట్‌కి 20% వెయిటేజీ ఉంటుంది. సబ్జెక్టుల వారీగా సిలబస్, ఏ కేటగిరీలో ఎన్ని మార్కులు ఉంటాయనే పూర్తి వివరాలను <>https://apdsc.apcfss.in/<<>> వెబ్‌సైట్‌లో విద్యాశాఖ ఉంచింది.

News April 21, 2025

ఎండల తీవ్రతతో జనవాణి వేళల్లో మార్పులు

image

AP: ఎండల తీవ్రత దృష్ట్యా జనవాణి వేళల్లో మార్పులు చేసినట్లు జనసేన పార్టీ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. సోమవారం నుంచి గురువారం వరకు రోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మళ్లీ సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు నిర్వహిస్తామని పేర్కొంది. కాగా జనవాణి కింద ప్రజా సమస్యలపై జనసేన అర్జీలు స్వీకరించి పరిష్కారం చూపుతున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!