News August 31, 2025

విజయవాడలో నేడు నాన్ వెజ్ ధరలు ఇవే!

image

విజయవాడలో ఆదివారం మాంసం ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కేజీ రూ. 220, స్కిన్‌ కేజీ రూ. 210. చేపలు రాగండి కేజీ రూ. 200, బొచ్చ కేజీ రూ. 230. మటన్ కేజీ రూ. 900 వద్ద స్థిరంగా ఉంది. కోడిగుడ్లు 30 గుడ్ల హోల్‌సేల్ ధర రూ. 170కి పెరిగింది. (గతవారం రూ. 160). మరి ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News September 4, 2025

అలాంటి లింకులపై క్లిక్ చేయొద్దు: ఎస్పీ

image

గుర్తు తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఏపీకే పేరుతో వచ్చే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దన్నారు. వివిధ వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తే వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. మీ అనుమతులు లేకుండా ఏవైనా లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే 1930కు కాల్ చేయాలన్నారు.

News September 4, 2025

వరంగల్: నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు

image

అధిక సి-సెక్షన్లు చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద హెచ్చరించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు పాటించిన ప్రైవేటు ఆసుపత్రులకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తామని, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

News September 4, 2025

పిడూరుమిట్టలో విషాదం.. నిమజ్జనోత్సవంలో బాలుడు మృతి

image

మనుబోలు మండలం పిడూరుమిట్టలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నన్నూరు జస్వంత్ కుమార్ (16) పది చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలో వినాయక బొమ్మను ఏర్పాటు చేసి బుధవారం ఉదయం బొమ్మను సముద్రంలో నిమజ్జనం చేయుటకు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం శ్రీనివాస సత్రంనకు బయలుదేరి వెళ్లారు. సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా జస్వంత్ కుమార్ పడిపోయి చనిపోయాడు. ఎస్సై శివ రాకేశ్ విచారణ చేపట్టారు.