News August 31, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

ఏపీలోని విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220గా ఉంది. గుంటూరు, చిత్తూరులో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. అటు హైదరాబాద్లో రూ.200-220, వరంగల్లో రూ.210, ఖమ్మం, నల్గొండలో రూ.220 వరకు విక్రయిస్తున్నారు. కేజీ మటన్ ధర రూ.800 నుంచి రూ.900 మధ్య ఉంది. మీ ఏరియాలో చికెన్, మటన్ రేట్లు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
Similar News
News September 1, 2025
పురుగు మందుల పిచికారీ.. సూచనలు

☛ ఎకరానికి కావలసిన ద్రావణాన్ని ఒకేసారి తయారు చేసుకోవాలి. మోతాదు కొలవడానికి మందు డబ్బాతో వచ్చిన కొలమానాన్ని వాడాలి.
☛ మందును చేత్తో కలపరాదు. ఏదైనా కర్రను ఉపయోగించాలి. ☛ పిచికారీ సమయంలో రక్షక దుస్తులు, చేతి గ్లౌజులు, ముక్కు మాస్క్, కళ్ల రక్షణ అద్దాలు ధరించాలి. పిచికారీ సమయంలో నీరు తాగటం, ఆహారం తినడం, గుట్కా తినడం, పొగ తాగడం చేయరాదు. వాడేసిన మందు డబ్బాలను గుంత తవ్వి పూడ్చి పెట్టాలి.
News September 1, 2025
రిజర్వేషన్ల పెంపు బిల్లును ఆమోదించండి.. గవర్నర్కు వినతి

TG: స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ల <<17570615>>నిబంధనను<<>> ఎత్తివేస్తూ, BCలకు రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన బిల్లును ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు. PCC చీఫ్ మహేశ్, మంత్రులు పొన్నం, సీతక్క, BRS, CPI నేతలు అందులో ఉన్నారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, మూడ్ ఆఫ్ హౌస్ పరిగణనలోకి తీసుకొని రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని కోరారు.
News September 1, 2025
చర్మానికి డ్రై బ్రషింగ్ చేస్తున్నారా..?

స్నానానికి ముందు శరీరాన్ని డ్రై బ్రషింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు చర్మ నిపుణులు. డ్రై బ్రషింగ్ చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే డ్రై బ్రషింగ్ చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా చేస్తే చర్మంపై నొప్పి, దద్దుర్లు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మైల్డ్గా చేయడం ఉత్తమం.