News August 31, 2025

అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను, పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎమ్మెల్యేలకు పెన్ డ్రైవ్‌లో అందించింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు బండారు రాజిరెడ్డి, బానోతు మదన్ లాల్ మృతి పట్ల సభలో సంతాపం ప్రకటించారు.

Similar News

News September 4, 2025

దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక: పవన్

image

AP: GST సంస్కరణలను Dy.CM పవన్ స్వాగతించారు. ‘స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇచ్చిన మాటను PM మోదీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ మార్పులతో పేద, మధ్య తరగతి, రైతులకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా విద్య, జీవిత బీమాపై GST తొలగింపు కోట్లాది కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. దేశానికి ఇదే నిజమైన దీపావళి కానుక. నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News September 4, 2025

భారత జట్టుకు దూరం.. భువి రియాక్షన్ ఇదే!

image

జాతీయ జట్టుకు ఎంపికవడం తన చేతుల్లో లేదని, దానిపై సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారని భారత బౌలర్ భువనేశ్వర్ అన్నారు. ‘మైదానంలో బాగా ఆడటం, ఫిట్‌గా ఉండటం, బౌలింగ్ చేసేటప్పుడు లైన్&లెంగ్త్‌పైనే నా ఫోకస్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత బాగా ఆడినా అదృష్టం కలిసిరాదు. అవకాశం వస్తే స్టేట్, జాతీయ జట్లకు నా బెస్ట్ ఇస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. భువి IND తరఫున చివరగా 2022 నవంబర్‌లో NZతో జరిగిన T20 మ్యాచులో ఆడారు.

News September 4, 2025

గ్యాలరీలో ఈ ఫొటోలు పెట్టుకుంటున్నారా?

image

మొబైల్ గ్యాలరీలో ఆధార్, పాన్ కార్డ్ ఫొటోలు పెట్టుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ టాండన్ సూచించారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన హ్యాక్ ప్రూఫ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్‌కు సంబంధించిన ఫొటోస్ డిజీలాకర్లలో స్టోర్ చేసుకోవాలన్నారు. కొన్ని యాప్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటాయని, అందుకే ఫొటోలు ఉంచడం సురక్షితం కాదని తెలిపారు.