News April 2, 2024

2029 నాటికి చంద్రబాబు కదలలేకపోవచ్చు: VSR

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘జనం వచ్చినా రాకున్నా.. మీ సోది ప్రసంగం వినలేక మధ్యలో వెళ్లిపోయినా.. తిరుగుతూనే ఉండండి చంద్రబాబు. ఎందుకంటే మీకు ఇవే ఆఖరి ఎన్నికలు. ఇంకెప్పుడూ ఇలా ఎండల్లో తిరిగే అవసరం రాదు. 2029 నాటికి వృద్ధాప్యం వల్ల మీరు కదలలేకపోవచ్చు. ఇప్పటికే బెయిల్ కోసం వంద జబ్బుల లిస్టు బయటపెట్టారుగా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

Similar News

News October 7, 2024

బంగ్లాపై గెలుపు.. టీమ్ ఇండియా రికార్డులు

image

తొలి T20లో బంగ్లాదేశ్‌పై ఘన <<14290970>>విజయం<<>> సాధించిన టీమ్ ఇండియా పలు రికార్డులు సృష్టించింది. ప్రత్యర్థి జట్లను అత్యధికసార్లు(42) ఆలౌట్ చేసిన టీమ్‌గా పాక్ వరల్డ్ రికార్డును సమం చేసింది. ఆ తర్వాత కివీస్(40), ఉగాండా(35), విండీస్(32) ఉన్నాయి. అలాగే 120+ పరుగుల లక్ష్యాన్ని భారత్ అత్యంత వేగంగా(11.5 ఓవర్లు) ఛేజ్ చేసింది. సూర్య సేనకు ఇదే ఫాస్టెస్ట్ ఛేజ్. 2016లో బంగ్లాపైనే 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.

News October 7, 2024

Stock Market: లాభాల్లోనే మొదలయ్యాయ్

image

గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్ అందడంతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. BSE సెన్సెక్స్ 81962 (274), NSE నిఫ్టీ 25072 (57) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి. ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంక్, ఇన్ఫీ, సిప్లా టాప్ గెయినర్స్. టైటాన్, బీఈఎల్, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా టాప్ లూజర్స్. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 26:24గా ఉంది.

News October 7, 2024

కరాచీ ఉగ్రదాడిలో ఇద్దరు చైనీయులు మృతి

image

పాకిస్థాన్ కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన <<14292979>>ఉగ్రదాడిలో<<>> ఇద్దరు చైనీయులు మరణించారు. ఈమేరకు పాక్‌లోని చైనా ఎంబసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తొలుత దీన్ని ఆత్మాహుతి దాడిగా భావించినా, వాహనంలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు తర్వాత అధికారులు గుర్తించారు. కాగా విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఇప్పటికే బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకున్న విషయం తెలిసిందే.