News August 31, 2025

తప్పుడు ప్రకటనలు మానుకోండి: ధర్మాన

image

ప్రజా సమస్యలను వదిలేసి సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. మబుగాం క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రుషికొండ భవనాలపై చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రకటనలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు తీసి వారి కడుపు కొట్టొద్దని సూచించారు.

Similar News

News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.

News September 3, 2025

పలాసలో దారుణ హత్య ..!

image

పలాస(M) కేసుపురంలో మంగళవారం అర్ధరాత్రి చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలువురు దాసుల వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 3, 2025

సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

image

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.