News August 31, 2025
ఇకపై డిజిటల్ విధానంలో చెల్లింపులు: కలెక్టర్

ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు సులభతరంగా పన్నులు చెల్లించేందుకు స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను ప్రవేశపెట్టినట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అసెస్మెంట్ ఆధారంగా ప్రజలు ఇంటి పన్నులు డిజిటల్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు నేరుగా గ్రామ పంచాయితీ ట్రెజరీ ఖాతాలోనే జమ అవుతాయన్నారు.
Similar News
News September 3, 2025
బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
News September 3, 2025
జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 3, 2025
వార్డు సచివాలయాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

వార్డు సచివాలయాల పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో చెత్త సేకరణతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటిపై వచ్చే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని పేర్కొన్నారు.