News August 31, 2025

వచ్చే నెల 6న ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం

image

TG: ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ సమితి ప్రకటించింది. సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటంతో వినాయక నిమజ్జనాలపై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో స్పష్టతనిచ్చింది. ఇవాళ ఆదివారం కావడంతో ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Similar News

News September 4, 2025

సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

image

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.

News September 4, 2025

ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

image

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.

News September 4, 2025

క్యాబినెట్ భేటీలో సుగాలి ప్రీతి కేసు ప్రస్తావన

image

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రీతి ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక పవన్ తన కూతురి కేసును పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రీతి తల్లి ఆరోపించారు.