News August 31, 2025

విశాఖలో ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక సమావేశం

image

ఉత్తరాంధ్ర ప్రజా సంకల్ప వేదిక విస్తృత స్థాయి సమావేశం ఆదివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు మాదిరి రంగాసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్ప వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై, రాజ్యాంగ హక్కులను కాపాడడం కోసం పనిచేస్తుందన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవచేస్తున్న 35 మంది ప్రతినిధులను సేవారత్న అవార్డులతో సత్కరించారు.

Similar News

News September 3, 2025

విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మాడగడకు పవన్

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈనెల 5వ తేదీన అల్లూరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విశాఖ విమానాశ్రయానికి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో ద్వారా అరకు వ్యాలీ మండలం మాడగడ గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నిర్వహించనున్న బలిపోరోబ్ ముగింపు ఉత్సవంలో పాల్గొనున్నారు. 3:30కి మాడగడ నుంచి తిరిగి పయణమై సాయంత్రం 5:30కి తిరిగి విశాఖ చేరుకుంటారు.

News September 3, 2025

స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులకు అందని జీతాలు..!

image

స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మూడో తేదీ వచ్చినా జీతాలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఏడాదిగా ప్రతినెల జీతంలో 75% మాత్రమే చెల్లిస్తున్నట్లు ఉద్యోగులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు మూడు రెట్ల జీతం యాజమాన్యం బకాయి పడిందన్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 3, 2025

విశాఖలో హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్: సీపీ

image

విశాఖ కమిషనరేట్ పరిధిలో 4 హోంగార్డ్ పోస్టులకు సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే మంగళవారం మరో 3 పోస్టులు కలిపి మొత్తం 7 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 21 నుంచి 50 సంవత్సరాల వయసు గల విశాఖకు చెందిన యువతీ, యువకులు అర్హులు. అభ్యర్థులు SEP 30వ తేదీలోపు అప్లికేషన్ సీపీ కార్యాలయంలో అందజేయాలన్నారు.