News April 2, 2024
మహువా మొయిత్రాపై ఈడీ కేసు

టీఎంసీ నేత మహువా మొయిత్రాపై ED మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. పార్లమెంట్లో ప్రశ్నలకు ముడుపుల కేసులో మహువాపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. బిజినెస్ మ్యాన్ దర్శన్ హీరానందానీ కోసం పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని.. ఇందుకుగానూ ఆమె ముడుపులు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారిస్తోంది. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాగా మహువా కృష్ణానగర్ నుంచి MPగా పోటీ చేస్తున్నారు.
Similar News
News September 16, 2025
శుభ సమయం (16-09-2025) మంగళవారం

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు
News September 16, 2025
TODAY HEADLINES

* యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ఇస్తాం: చంద్రబాబు
* కాలేజీల యాజమాన్యాలతో TG ప్రభుత్వం చర్చలు సఫలం
* చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: PM మోదీ
* మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్
* బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా
* వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
* ఆసియా కప్లో సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా
News September 16, 2025
వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.