News August 31, 2025
VZM: గౌరవ వందనం స్వీకరించిన అశోక్ గజపతిరాజు

గోవా గవర్నర్గా బాధ్యతలను స్వీకరించిన తర్వత పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు.
దీంతో ఆదివారం ఆయన స్వగృహం వద్ద ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి అశోక్ గజపతిరాజు గౌరవ వందనం స్వీకరించారు.
Similar News
News September 4, 2025
VZM: ‘13న కేసులు రాజీ చేసుకోండి’

విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.
News September 4, 2025
VZM: ‘మధ్యవర్తిత్వ కార్యక్రమానికి విశేష స్పందన’

విజయనగరం జిల్లాలో నిర్వహించిన మధ్యవర్తిత్వ కార్యక్రమానికి భారీగా విశేష స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత గురువారం తెలిపారు. 3 నెలలుగా జిల్లా కోర్టులో ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రానికి 1,100 కేసులు మధ్యవర్తిత్వ ప్రక్రియకు పంపించగా అందులో 30 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదాలు పరిష్కరించుకోవచ్చన్నారు.
News September 4, 2025
VZM: ‘50 వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలి’

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన ఛాంబర్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 15 హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. 11 సాంఘిక, 39 బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.