News August 31, 2025
1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. సెప్టెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి స్పెషల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు వారి అర్జీలను కలెక్టరేట్లో అందించే అవసరం లేకుండా https://Meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు.
Similar News
News September 4, 2025
అర్మానీ.. ‘Its a Brand’ 1/2

మనలో చాలామందికి సుపరిచితమైన ‘అర్మానీ’ దుస్తుల బ్రాండ్ ఓనర్ జార్జియో అర్మానీ(91) <<17614096>>కన్నుమూశారు<<>>. ఇటలీలో 1975లో అర్మానీ, ఆయన పార్ట్నర్ సెర్జియో గలాటీ మెన్స్వేర్ దుకాణాన్ని తెరిచారు. అందుకు తమ వద్దనున్న పాత వోక్స్వ్యాగన్ కారును అమ్మేశారు. వ్యాపారం బాగా నడవడంతో తర్వాత ఏడాదికి మహిళల దుస్తులనూ విక్రయించడం ప్రారంభించారు. ఆ తర్వాత వారి వ్యాపార సామ్రాజ్యం సరిహద్దులు దాటింది. ఖండాంతరాలకు విస్తరించింది.
News September 4, 2025
అర్మానీ.. ‘Its a Brand’ 2/2

అర్మానీ కంపెనీ కేవలం దుస్తులకే పరిమితం కాకుండా యాక్సెసరీస్లు, హోమ్ ఫర్నిషింగ్స్, పెర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బుక్స్, ఫ్లవర్స్, చాకోలెట్స్ తదితర విక్రయాల్లోనూ తన బ్రాండ్ పవర్ చూపించింది. జార్జియో అర్మానీకి సొంత బాస్కెట్బాల్ టీమ్తో పాటు పలు దేశాల్లో బార్లు, క్లబ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం ఆయన సంపద 10 బిలియన్ డాలర్లు.
News September 4, 2025
కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.