News August 31, 2025
ఖమ్మం: ACCIDENT.. మహిళ SPOT DEAD

రఘునాథపాలెం(M) వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఏన్కూరు(M) కేసుపల్లికి చెందిన వెంకటేశ్వర్లు తన భార్య లక్ష్మితో కలిసి బైక్పై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా, భర్త వెంకటేశ్వర్లు గాయపడ్డారు. కళ్ల ముందే భార్య మరణించడంతో వెంకటేశ్వర్లు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Similar News
News September 5, 2025
రేపు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోనున్న సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.
News September 5, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> మహానంది అవార్డు గెలుచుకున్న దేవరుప్పుల వాసి
> సిటీ స్కాన్ అందుబాటులోకి తెచ్చాం: జనగామ ఎమ్మెల్యే
> జనగామ: వన మహోత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
> కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: కడియం
> పాలకుర్తి: గణేశుడికి 516 పిండి వంటకాలు
> బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్
> దేవరుప్పుల: ఇసుక అక్రమ రవాణా వ్యక్తిపై కేసు నమోదు
> నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు
News September 5, 2025
ఖమ్మం: పాఠశాలల్లో క్రీడల ప్రోత్సాహంపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పీఈటీ కోచ్లతో సమీక్ష నిర్వహించారు. ప్రతి విద్యార్థి వారానికి 150 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ చేయడం తప్పనిసరి చేయాలని సూచించారు. క్లస్టర్, మండల స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రతిభావంతులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల్లో స్పోర్ట్స్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంచాలని సూచించారు.