News August 31, 2025

పుజారాను మెచ్చుకుంటూ మోదీ లేఖ

image

అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు <<17502622>>పుజారా<<>> వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన రిటైర్మెంట్‌పై స్పందిస్తూ PM మోదీ లేఖ రాసినట్లు పుజారా వెల్లడించారు. ఆయన పంపిన లేఖను SMలో పంచుకున్నారు. సౌరాష్ట్రతో అనుబంధం మొదలు AUSలో డేంజరస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించడం వరకు ప్రతి అంశాన్ని ఆ లేఖలో పేర్కొన్నారు. పుజారా కుటుంబం చేసిన త్యాగాలనూ ప్రస్తావించారు. తనకు లేఖ రాయడంపై మోదీకి పుజారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశాతో పాటు ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వైపుగా కదిలే అవకాశముందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు కృష్ణా పరీవాహకంలో వరద తగ్గుముఖం పట్టిందని, గోదావరి పరీవాహకంలో స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News September 3, 2025

కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎస్టీ శ్లాబుల మార్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆక్వా రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రభావం పడే వస్తువుల విషయంలోనూ చర్చించనున్నారు. రైతులు, ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

News September 3, 2025

ట్రాఫిక్ సమస్యను తీర్చిన ‘సింగపూర్ మోడల్’!

image

ఇండియాలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. 1975లో ఇలాంటి సమస్యే సింగపూర్‌లో ఎదురవగా వినూత్న ఆలోచనతో పరిష్కరించారు. నగరంలోని రద్దీ ఉండే ప్రాంతాలను ‘నియంత్రిత మండలం’గా గుర్తించి, ఇందులో ప్రవేశానికి ప్రత్యేక లైసెన్స్, నెలవారీ రుసుము పెట్టారు. సింగిల్‌గా కాకుండా కారులో నలుగురు ఉంటే ఆ లైసెన్స్ అక్కర్లేదు. దీంతో రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గి ట్రాఫిక్ సజావుగా సాగింది.