News August 31, 2025
KNRలో గిరిజన నాయకులను అరెస్టు చేసిన పోలీసులు

HYDలో జరిగే చర్చా గోష్టికి వెళ్తున్న గిరిజన సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్, జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్, శివరాజులను కరీంనగర్లో పోలీసులు ఆదివారం హౌస్ అరెస్టు చేశారు. దీంతో గిరిజన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారా, లంబాడీలను ST జాబితా నుంచి తొలగించాలని కుట్రపూరితంగా కోర్టులో కేసు వేసిన సోయం బాపూరావు, వెంకటరావులను అరెస్టు చేయకుండా తమను అడ్డుకోవడం అన్యాయమని మండిపడ్డారు.
Similar News
News September 3, 2025
KNR: రేపటి నుంచి వైన్స్ బంద్

వినాయక నిమజ్జనం నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 4వ తేదీ(రేపు) ఉదయం 6 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ అధికారి పి.శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం A4 దుకాణాలు, 2B బార్లు, CI క్లబ్స్, కల్లు దుకాణాలు/డిపోలు, మిలిటరీ క్యాంటీన్ & టి.ఎస్.బి.సి.ఎల్ KNR డిపో మూసివేయాలని అదేశించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.
News September 3, 2025
KNR: మానేరు రివర్ ఫ్రంట్ పరిశీలించిన కలెక్టర్

మానేరు రివర్ ఫ్రంట్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం పరిశీలించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను ఈ సందర్భంగా ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు భూములు సేకరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు ఉన్నారు.
News September 3, 2025
KNR: ‘NH భూసేకరణ సమస్యలు పరిష్కరించాలి’

కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న జాతీయ రహదారి 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, భారత జాతీయ రహదారి సంస్థ ప్రాంతీయ అధికారి శివశంకర్, వరంగల్ ప్రాజెక్ట్ సంచాలకులు నాగరాజు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేష్ బాబుతో జిల్లా కలెక్టర్ మంగళవారం భూసేకరణ సమస్యలపై సమావేశం నిర్వహించారు.