News August 31, 2025

ALERT: మూడు రోజులు భారీ వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. TGలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా రాబోయే 3 రోజులు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

Similar News

News September 3, 2025

పలు జిల్లాల్లో వరుసగా 3 రోజులు సెలవులు

image

TG: ఈ వారంలో పలు జిల్లాల్లో వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నెల 5న మిలాద్-ఉన్-నబీ సందర్భంగా రాష్ట్రమంతా పబ్లిక్ హాలిడే ఉంది. మరుసటి రోజు శనివారం గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో HYD, సికింద్రాబాద్, RR, మేడ్చల్‌లో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఉంటుందని పేర్కొంది. ఇక 7న ఆదివారం వస్తోంది. అటు ఏపీలో 5న సెలవు ఉంది.

News September 3, 2025

తీవ్ర అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర ఒడిశాతో పాటు ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ వైపుగా కదిలే అవకాశముందని APSDMA ట్వీట్ చేసింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు కృష్ణా పరీవాహకంలో వరద తగ్గుముఖం పట్టిందని, గోదావరి పరీవాహకంలో స్వల్పంగా పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

News September 3, 2025

కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభం

image

ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎస్టీ శ్లాబుల మార్పులపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆక్వా రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే ట్రంప్ విధించిన సుంకాల వల్ల ప్రభావం పడే వస్తువుల విషయంలోనూ చర్చించనున్నారు. రైతులు, ఉద్యోగులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు కేంద్ర మంత్రివర్గం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.