News August 31, 2025
SEP నుంచి ఏమేం మారుతాయంటే!

*SEP 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST సమావేశంలో 4 శ్లాబులకు బదులు.. 5%, 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం.
*రేపటి నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమలు కావొచ్చు.
*కొన్ని SBI క్రెడిట్ కార్డ్స్కు డిజిటల్ గేమింగ్, Govt పోర్టల్స్లో పేమెంట్స్ రివార్డు పాయింట్స్ ఉండవు.
*SEP 30లోపు జన్ధన్ ఖాతాలకు KYC పూర్తి చేయాలి.
*2025-26 అసెస్మెంట్ ఇయర్ ITR ఫైలింగ్కు SEP 15 చివరి తేదీగా ఉంది.
Similar News
News September 3, 2025
రుషికొండ ప్యాలెస్ను మెంటల్ ఆసుపత్రిగా మార్చాలి: అశోక్

AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.
News September 3, 2025
హీరో రాజ్ తరుణ్పై మరో కేసు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
News September 3, 2025
యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.