News August 31, 2025

రేపు మన పాఠశాల-మన ఆత్మగౌరవం: మెదక్ ఎంపీ

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం మన పాఠశాల-మన ఆత్మగౌరవం కార్యక్రమాన్ని నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సంగారెడ్డిలో తపస్ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మన పాఠశాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకుడు మాధవరెడ్డి పాల్గొన్నారు.

Similar News

News September 3, 2025

మెదక్ జిల్లాలో 5,23,327 మంది ఓటర్లు

image

తుది ఓటరు జాబితా ప్రకారం మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులు ఉన్నాయి. మొత్తం 5,23,327 మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 2,51,532 మంది, మహిళలు 2,71,787 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. వార్డుకు ఒకటి చొప్పున మొత్తం 4,220 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తులో అధికారులు నిమగ్నమయ్యారు.

News September 3, 2025

MDK: అత్తింటి వేధింపులతో నవ వధువు సూసైడ్

image

చిన్నశంకరంపేటకు చెందిన రాధిక(19)కు నెల రోజుల క్రితం ఇంటి పక్కనే ఉన్న వానరాసి కుమార్(22)తో పెళ్లి అయింది. కాగా, అత్తింటి వేధింపులు భరించలేక<<17595482>> నవ వధువు రాధిక<<>> ఊరేసుకున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. అయితే రాధిక తండ్రి రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. తల్లి, అన్న, చెల్లెలు గత ఏడాది చనిపోయారు. ప్రస్తుతం 15 ఏళ్ల తమ్ముడు, ఇద్దరు అక్కలు ఉండగా.. ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

News September 3, 2025

విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ అవసరం: సీఐ రేణుక

image

పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు క్రీడలు, క్రమశిక్షణ చాలా అవసరమని అల్లాదుర్గం సీఐ రేణుక అన్నారు. అల్లాదుర్గ మండలం ముస్లాపూర్ పాఠశాలలో ఎంఈఓ ధనుంజయ అధ్యక్షతన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడ పోటీలు ప్రారంభించారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనన్నారు. మానసిక వికాసం వంటివి విద్యార్థులలో అభివృద్ధి చెందుతాయని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని సూచించారు.