News August 31, 2025

రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.

Similar News

News September 1, 2025

దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ

image

AP: <<17398848>>నోటీసులతో<<>> సంబంధంలేకుండా సెప్టెంబర్ నెలలో దివ్యాంగులందరికీ పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35లక్షల మందిలో 95% మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హులపై రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశారు.

News September 1, 2025

తుమ్మిడిహట్టి, మేడిగడ్డపైనే ప్రధాన చర్చ

image

TG: కాళేశ్వరాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంపైనే అసెంబ్లీలో ప్రధాన చర్చ జరిగింది. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని కేంద్రం చెప్పినా BRS ప్రభుత్వం దోపిడీ చేసేందుకే దాన్ని మార్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. MH అభ్యంతరం కేవలం ఎత్తుపైనే అని తెలిపారు. మేడిగడ్డ వద్ద అదనంగా 120 TMCల లభ్యత ఉందని హరీశ్ రావు తెలిపారు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ, CWC సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

News September 1, 2025

ALERT: ఇవాళ భారీ వర్షాలు

image

బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో APలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులపాటు వానలు పడతాయంది. ఇవాళ SKLM, VZM, మన్యం, అల్లూరి, VSP, అనకాపల్లి, KKD, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంది. అటు TGలో ఆసిఫాబాద్, MNCL, NRML, పెద్దపల్లి, భూపాలపల్లి, MLG, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది.