News September 1, 2025
రేపటి నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు వైద్య పరిక్షలు: ఎస్పీ

చిత్తూరు జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 2 నుంచి 7 వరకు వైద్య పరిక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటలకు చిత్తూరు పాత జిల్లా పోలీసు కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు. మహిళా అభ్యర్థులకు 2, 3న, పురుష అభ్యర్థులకు 4 నుంచి 7 వరకు పరిక్షలు నిర్వహిస్తారన్నారు.
Similar News
News September 4, 2025
ఎంపీడీవోలు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వివిధ మౌలిక వసతుల కల్పన కోసం 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరులోని జడ్పీ కార్యాలయంలో జిల్లాలో 15వ ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారో సంబంధిత ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు.
News September 3, 2025
చిత్తూరు జిల్లాలో ముగ్గురికి రాష్ట్రస్థాయి అవార్డులు

చిత్తూరు జిల్లాలో ముగ్గురు టీచర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు లభించాయి. నరహరిపేట జడ్పీ టీచర్ ఫిజిక్స్ టీచర్ నౌషద్ అలీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన 30 ఏళ్లుగా విద్యా రంగంలో సేవలు అందించారు. ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ సైతం రూపొందించారు. పుంగనూరు మండలం రాంనగర్ స్కూల్ టీచర్ హేమలత, నక్కబండ కేజీబీవీ టీచర్ నౌజియా సైతం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు ఎంపికయ్యారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
News September 3, 2025
CTR: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

చిత్తూరు జిల్లా పలమనేరులోని ఓ వ్యభిచారం గృహంపై మంగళవారం సాయంత్రం పోలీసులు రైడ్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జయప్ప వీధిలో జ్యోత్స్న అనే మహిళ విటులును రప్పించి వ్యభిచారం చేయిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. వాళ్లు దాడి చేసి ఓ మహిళ, ఓ విటుడితో పాటు నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఏడాదిన్నర నుంచి ఆమె అద్దె ఇంట్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం.