News September 1, 2025

కాళేశ్వరంపై CBI విచారణకు నిర్ణయం.. ఇందుకేనా?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం CID లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం KCR అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.

Similar News

News September 1, 2025

కొత్తగా పెళ్లైందా.. ఇవి పాటించండి!

image

కొత్త దంపతులు ఎక్కువగా మాట్లాడుకుంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ఫోన్లు, టీవీ పక్కనపెట్టి కాసేపు భవిష్యత్ లక్ష్యాల గురించి చర్చించుకోవాలి. నచ్చిన వంట చేసుకుని కలిసి తినాలి. పనుల్లో ఒకరికొకరు సాయంగా నిలవాలి. కోపాన్ని పక్కనపెట్టి సహనంతో సమస్యలను పరిష్కరించుకోవాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి. శృంగారంలో పరస్పర ఇష్టాలను గౌరవించుకోవాలి’ అని చెబుతున్నారు.

News September 1, 2025

CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్‌లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.

News September 1, 2025

పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే: PM మోదీ

image

చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ ఆయనను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను Xలో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ సంభాషించినట్లు పేర్కొన్నారు.