News September 1, 2025

నంద్యాల: ‘ఆ గ్రామంలో 22 ఏళ్ల నుంచి గణేశ్ ఉత్సవాలు లేవు’

image

నంద్యాల(D) ప్యాపిలిలో 22 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలకు గ్రామస్థులు దూరంగా ఉంటున్నారు. 2003 SEP 2న గ్రామంలోని SC కాలనీలో ప్రతిష్ఠించిన విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగిస్తుండగా అగ్రకులాల వారు అడ్డుకున్నారు. పెద్దఎత్తున ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 187 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. అప్పటి నుంచి మండపాలలో వినాయకుడిని ప్రతిష్ఠించకుండా ఇళ్లలోనే ఉత్సవాలు చేస్తున్నారు.

Similar News

News September 5, 2025

HYD: సందర్శకుల కోసం పార్కింగ్ ఇక్కడే

image

రేపు నగరంలో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకులకు పార్కింగ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ MMTS స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధభవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాంకాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్ బండ్, గో సేవా సదన్, కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేశారు.

News September 5, 2025

HYD: సందర్శకుల కోసం పార్కింగ్ ఇక్కడే

image

రేపు నగరంలో వినాయక నిమజ్జనాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సందర్శకులకు పార్కింగ్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ MMTS స్టేషన్, ఆనంద్‌నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జడ్పీ ఆఫీస్ మధ్య, బుద్ధభవన్ పక్కన, ఎన్టీఆర్ స్టేడియం, నిజాంకాలేజీ, పబ్లిక్ గార్డెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, లోయర్ ట్యాంక్ బండ్, గో సేవా సదన్, కట్ట మైసమ్మ టెంపుల్ వద్ద ఏర్పాటు చేశారు.

News September 5, 2025

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న మహేశ్‌గౌడ్

image

ఖైరతాబాద్ బడా గణేశ్‌ను టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ఆయనను సత్కరించి విఘ్నేశ్వరుడి ప్రతిమను బహుకరించారు.