News September 1, 2025
కడప: బాలికపై అత్యాచారయత్నం

కడప జిల్లా మైలవరం మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐదుగురు యువకులు గాలి మరల రిపేర్ పనుల కోసం వచ్చి ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అందులో మహ్మద్ అలీ(35) అనే యువకుడు 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అత్యాచార యత్నం చేయడంతో బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
AUTO MATE యాప్ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.
News September 3, 2025
బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.