News September 1, 2025
పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే: PM మోదీ

చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను కలవడం పట్ల ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ‘పుతిన్ను కలవడం ఎప్పుడూ ఆనందమే’ అని పేర్కొంటూ ఆయనను హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడిన ఫొటోలను Xలో షేర్ చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ సంభాషించినట్లు పేర్కొన్నారు.
Similar News
News September 5, 2025
ఈ జిల్లాల్లో వర్షాలు!

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చెదురుమదురు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాలతో పాటు హైదరాబాద్లో అక్కడక్కడ జల్లులు పడే ఛాన్స్ ఉందని పేర్కొంటున్నారు. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?
News September 5, 2025
లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును సిట్ విచారణకు పిలిచింది. కేసుకు సంబంధించి ఆయనను ప్రశ్నిస్తోంది. ఆయన చెప్పే సమాధానాలు కేసుకు కీలకంగా మారనున్నట్లు సిట్ భావిస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో వైసీసీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు.
News September 5, 2025
రబీ సీజన్కు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా: అచ్చెన్న

AP: రబీ సీజన్ కోసం 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. యూరియా స్టాక్, సప్లై, పంపిణీపై పలు జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఉంది. ఆ జిల్లాల్లో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలి. యూరియా నిల్వల్లో తేడా లేకుండా చూసుకోవాలి’ అని ఆదేశించారు.