News April 3, 2024
చిత్తూరు: నాలుగు రోజుల్లో పెన్షన్ ప్రక్రియ పూర్తి చేయండి

జిల్లాలో ఈ నెల 3 వ తేదీ నుండి గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.షణ్మోహన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో మాట్లాడుతూ.. పెన్షన్ ల పంపిణీ ఈ నెల 3 వ తేదీ నుంచి 6 వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రక్రియకు ఎంపీడీవోలు సచివాలయ సిబ్బందిని ఎంపిక చేసి ఆదేశాలు జారీ చేయాలన్నారు. జిల్లాలో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు.
Similar News
News April 16, 2026
కుప్పం: మళ్లీ నల్లకోటు వేసిన రెడ్డప్ప

చిత్తూరు మాజీ MP, వైసీపీ సీనియర్ నేత రెడ్డప్ప మళ్లీ నల్లకోటు ధరించి కుప్పం కోర్టుకు హాజరయ్యారు. మాజీ CM జగన్ CPRO శ్రీహరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. YCP లీగల్ సెల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డితోపాటు చిత్తూరు మాజీ MP రెడ్డప్ప శ్రీహరి తరపున వాదించేందుకు వచ్చారు. ఖద్దర్ చొక్కాలో కనిపించే రెడ్డప్ప నల్లకోటు ధరించి రావడంతో ఆయనతో వైసీపీ శ్రేణులు సెల్ఫీలు తీసుకున్నాయి.
News April 15, 2026
BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.
News April 15, 2026
BIG BREAKING ఇంటర్ ఫలితాలు.. వెనుకబడ్డ చిత్తూరు

ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. <<19653702>>ఫస్టియర్లో చిత్తూరు జిల్లా నుంచి 1<<>>2,567 మంది పరీక్ష రాయగా 8,691మంది పాసయ్యారు. 69 % పాస్ మార్కులతో జిల్లా 22 వ స్థానంలో నిలిచింది. అలాగే సెకండియర్కు 11,651 మంది పరీక్షలు రాయగా 8,280 మంది పాసయ్యారు. 71% పాస్ మార్కులతో చిత్తూరు 24 వ ప్లేస్ దక్కించుకుంది.


