News September 1, 2025
వరల్డ్ కప్ విజేతలకు భారీ నజరానా

మహిళల ODI WC విజేతలకు ICC భారీ నజరానా ప్రకటించింది. విన్నర్స్కు రూ.39.50 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నట్లు తెలిపింది. గత WC(2022)లో ఇది ₹11.65 కోట్లు మాత్రమే. రన్నరప్కు రూ.19.78 కోట్లు, సెమీ ఫైనలిస్టులకు రూ.9.75 కోట్లు, 5, 6 స్థానాలకు రూ.4.50 కోట్లు, 7,8 స్థానాలకు రూ.2.20 కోట్లు, టోర్నీలో ఆడిన ప్రతి జట్టుకూ అదనంగా రూ.2 కోట్లు అందించనుంది. మొత్తంగా రూ.122 కోట్లు ప్రైజ్ మనీగా బహూకరించనుంది.
Similar News
News September 22, 2025
పవన్ ‘OG’కి ‘A’ సర్టిఫికెట్.. 1AM షో క్యాన్సిల్

‘OG’ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఈ సినిమా పెద్దలకు మాత్రమే అని అర్థం. మూవీలో విపరీతమైన వైలెన్స్ కారణంగానే A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా రన్ టైమ్ను 2.34 గంటలకు(154ని. 15 సెకన్లు) లాక్ చేశారు. అటు ఏపీలో 25న 1AM షోను క్యాన్సిల్ చేసి 24న రాత్రి 10 గం.ల ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
News September 22, 2025
పరకామణిపై CBI విచారణ చేయాలి: YCP

AP: తిరుమల <<17772428>>పరకామణి<<>> వివాదంపై CBI విచారణ, SC నేతృత్వంలో జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని YCP డిమాండ్ చేసింది. CJI గవాయ్, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు వైసీపీ MP గురుమూర్తి లేఖలు రాశారు. హుండీ సొమ్ము చోరీ జరిగిందన్న ఆరోపణల వెనుక రాజకీయ దురుద్ధేశాలు ఉన్నాయన్నారు. సరైన ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే తిరుమలను పవిత్రంగా భావించే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని అసహనం వ్యక్తం చేశారు.
News September 22, 2025
నక్సలైట్లపై మరో మేజర్ విక్టరీ: అమిత్షా

నక్సలైట్లపై భద్రతా బలగాలు మరో మేజర్ విక్టరీ సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్(D) అబూఝ్మాడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను మట్టుబెట్టాయని ట్వీట్ చేశారు. బలగాలు ప్లాన్ ప్రకారం నక్సల్స్ టాప్ లీడర్స్ను అంతమొందిస్తున్నాయని అన్నారు. కాగా చనిపోయిన ఇద్దరిపై రూ.40 లక్షల చొప్పున రివార్డు ఉంది.