News September 1, 2025

ఫామ్ హౌస్‌కు క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు!

image

TG: ఎమ్మెల్సీ <<17582704>>కవిత<<>> సంచలన ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. అంతకుముందే కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న రేవంత్ ఆదేశాలపై కేసీఆర్, కేటీఆర్ సమావేశమైనట్లు సమాచారం. ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారని చర్చ జరుగుతోంది.

Similar News

News September 22, 2025

నవరాత్రి ఉత్సవాలు.. ఉపవాసం ఉంటున్నారా?

image

నవరాత్రుల సందర్భంగా వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే సరైన జాగ్రత్తలు పాటించకపోతే త్వరగా అలసిపోవడం, తల తిరగడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు తినడం, రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగడం, ఫైబర్, ప్రొటీన్, ఆహారంలో కార్బోహైడ్రేట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకోవడం వంటి చిట్కాల ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

News September 22, 2025

₹500 కోట్లతో NTTPS కాలుష్య నివారణ పనులు

image

AP: NTTPS కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. పొల్యూషన్ రాకుండా ప్లాంటులో ₹500కోట్లతో పరికరాలు సమకూరుస్తున్నామన్నారు. ’పాండ్‌యాష్ నిల్వ, తరలింపుతోనే ఈ సమస్య. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు, యాష్ రవాణాకు టెండరింగ్ ఏజెన్సీని నియమించాం. ఏజెన్సీ ఏర్పాటుపై అపోహలొద్దు.’ అని పేర్కొన్నారు. స్థానికుల ఉపాధి దృష్ట్యా ఉచితంగా బూడిద లోడింగ్‌‌, రవాణా ఖర్చులు అందిస్తున్నామన్నారు.

News September 22, 2025

రాష్ట్రంలో 42 పోస్టులు.. దరఖాస్తుల సవరణకు కొన్ని గంటలే ఛాన్స్

image

<>ఏపీలో<<>> 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులో తప్పుగా నమోదు చేశారా? అలాంటి వారికి ముఖ్య గమనిక. తప్పుల సవరణకు ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఉంది. వివరాలు తప్పుగా నమోదు చేసినవారు సవరణ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి తెలిపింది. ఈ పోస్టులకు సెప్టెంబర్ 7వరకు దరఖాస్తులను స్వీకరించింది.