News April 3, 2024
నేటి నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటి నుండి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. పట్టణంలో భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో MBNR, GDWL, NRPT జిల్లాలకు సంబంధించిన సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొంటారు. NGKL జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో WNP, NGKL జిల్లాల సిబ్బంది మూల్యాంకనం ప్రక్రియలో పాల్గొనున్నారు. మూల్యాంకనం కోసం 1,800 ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చారు.
Similar News
News February 27, 2026
పాలమూరు: హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి

TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. మహబూబ్ నగర్లోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి1న ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
News February 27, 2026
MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.
News February 27, 2026
MBNR: ‘ఆవిష్కరణలే లక్ష్యంగా గ్రాన్ టూరిస్మో 2.0’

పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు సంఖ్యలో పాల్గొన్నారు.


