News September 1, 2025
ప్రశాంతమైన జిల్లాగా పేరును నిలబెడదాం: కలెక్టర్

విజయనగరం జిల్లా చాలా ప్రశాంతమైనదని, ఆ పేరును నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ అంబేద్కర్ కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో జిల్లా శాంతి కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ నెలలో వినాయక నిమజ్జనం, దసరా ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబి పండగలు ఉన్న కారణంగా అవన్నీ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేటట్లు చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ పాల్గొన్నారు.
Similar News
News September 4, 2025
VZM: ‘50 వసతి గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలి’

స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సంక్షేమ హాస్టళ్లకు మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన ఛాంబర్లో గురువారం సమీక్షించారు. జిల్లాలో 15 హాస్టళ్లలో మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. 11 సాంఘిక, 39 బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు.
News September 4, 2025
VZM: ‘పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులు’

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తులు చేసిన వారికి సులువుగా అనుమతులను ఇవ్వాలని, దరఖాస్తుల పరిశీలన ఉదారంగా ఉండాలని JC సేతు మాధవన్ సూచించారు. గురువారం విజయనగరం కలెక్టరేట్లో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ పై వర్క్ షాప్ నిర్వహించారు. సింగల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత ఏడాది 2257 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చామన్నారు. ప్రతి నెలా జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీలో సమీక్షిస్తామన్నారు.
News September 4, 2025
VZM: 76 మంది ఉపాధ్యాయులకు రేపు సన్మానం

విజయనగరం జిల్లాకు చెందిన 76 మంది ఉత్తమ ఉపాధ్యాయులను రేపు సన్మానించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం జరిపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.