News September 1, 2025

చిత్తూరు: సాయుధ దళాలకు వీడ్కోలు

image

ఏడు రాష్ట్రాలు దాటి మోటార్ సైకిల్ పై వెళ్తున్న సాయుధ దళాలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా ఉందని అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. చిత్తూరులోని కాణిపాకం బైపాస్ రోడ్డులో సోమవారం ట్రై నేషన్, ట్రై సర్వీసెస్ లార్డ్ బుద్ధ మోటార్ సైకిల్ యాత్రను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఇలాంటి యాత్రలు యువతకు గొప్ప స్ఫూర్తి అని ఆయన చెప్పారు. యాత్ర చేస్తున్న వారికి ఘన వీడ్కోలు పలికారు.

Similar News

News September 7, 2025

కుప్పంలో 30 పోలీస్ యాక్ట్ : DSP

image

కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల 30వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని కుప్పం DSP పార్థసారథి తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయడం జరుగుతుందని, పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు వంటివి నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పోలీసుల అనుమతి లేకుండా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 6, 2025

జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

image

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.

News September 5, 2025

గురువులు సమాజ నిర్దేశకులు: చిత్తూరు MLA

image

గురువుల సమాజ నిర్దేశకులని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి మరువలేనిదని కొనియాడారు. గురువులకు ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తెలియజేశారు.