News April 3, 2024

కొత్త స్కీమ్.. ఈవీ వాహనాలకు రాయితీ ఇలా..

image

విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం తీసుకొచ్చిన EMPS కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది. జులై 31 వరకు అమల్లో ఉండే ఈ పథకం కింద రాయితీల కోసం రూ.500 కోట్లు కేటాయించారు. మొత్తం 3.72లక్షల ఈవీ వెహికల్స్ కొనుగోలును ప్రోత్సహించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని కింద EV బైక్‌లకు రూ.10 వేలు, ఇ-రిక్షా, ఇ-కార్ట్‌లకు రూ.25వేలు, 3 చక్రాల ఈవీలను కొనుగోలు చేసే వారికి రూ.50 వేల సబ్సిడీ లభిస్తుంది.

Similar News

News April 21, 2025

త్వరలో అకౌంట్లలోకి డబ్బులు

image

TG: యాసంగి సీజన్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 ఎకరాలలోపు రైతులకు ఇప్పటికే సాయం అందగా, ఆపైన ఉన్న రైతులందరికీ పూర్తిస్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం రూ.4వేల కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.

News April 21, 2025

రేపు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన

image

AP: కుటుంబంతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఇవాళ అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. సీఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్‌తో సమావేశమవుతారు. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై చర్చిస్తారని సమాచారం.

News April 21, 2025

KTRకు హైకోర్టులో ఊరట

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. ఉట్నూరు పీఎస్‌లో ఆయనపై నమోదైన FIRను న్యాయస్థానం కొట్టేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రూ.25వేల కోట్ల స్కామ్ చేసినట్లు KTR ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది సెప్టెంబర్‌లో ఆయనపై కేసు నమోదైంది.

error: Content is protected !!