News September 1, 2025

HYD: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం HYD మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్ వద్ద సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 46,000 ట్యాంకుల్లో చేపల పెంపకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్లు విడుదల చేసినట్లుగా తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, మెట్టు సాయి ఉన్నారు.

Similar News

News September 5, 2025

HYD: నేడు, రేపు WINES బంద్

image

రేపు గణపతి నిమజ్జనాల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్& రెస్టారెంట్లు ఇవాళ సా.6 నుంచి రేపు సా.6 గంటల వరకు మూసేయాలని CP సుధీర్ బాబు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో వైన్సు, బార్‌లు, కల్లుకాంపౌండ్‌లు బార్& రెస్టారెంట్లు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం ఉ.6 గం.కు బంద్ చేయాలని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలుంటాయని హెచ్చరించారు.

News September 5, 2025

ఫీజు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండమే: ఆర్.కృష్ణయ్య

image

తెలంగాణలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6 వేల కోట్లు వారం రోజుల్లోగా చెల్లించకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు బకాయిలపై వెంటనే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన గురువారం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు.

News September 5, 2025

పెరిగిన బిజినెస్.. GHMCకి భారీ ఆదాయం

image

మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. ఇళ్లు, స్థలాలు ఈ సంవత్సరం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో భవన నిర్మాణ అనుమతుల ద్వారా GHMCకి కోట్ల రూపాయల్లో ఆదాయం వస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు GHMCకి రూ.399 కోట్ల ఆదాయం రాగా.. ఈ సంవత్సరం అవే నెలలకు సంబంధించి రూ.759.98 కోట్లు వచ్చింది. అంటే దాదాపు డబుల్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. స్థిరాస్తి వ్యాపారం పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.