News September 2, 2025

తూర్పు గోదావరి జిల్లాకు 3వ స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ మూల్యాంకనంలో తూ.గో జిల్లా వైద్య సేవల్లో 3వ స్థానాన్ని సాధించిందని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే.వెంకటేశ్వర్ రావు సోమవారం తెలిపారు. కలెక్టర్ పి.ప్రశాంతి మార్గదర్శకత్వం, సూచనల మేరకు, వైద్య సిబ్బందితో సమన్వయం చేసుకోవడం వల్ల ఈ పురోగతి సాధ్యమైందని ఆయన అన్నారు. నిరంతరం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్షల ఫలితమే ఈ ఘనత అని పేర్కొన్నారు.

Similar News

News September 3, 2025

బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

image

బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

News September 3, 2025

జిల్లాలో అవసరానికి తగిన యూరియా సరఫరా: కలెక్టర్

image

జిల్లాలో ఖరీఫ్-2025 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా సమయానుకూలంగా సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాకు అవసరమైన 26,000 మెట్రిక్ టన్నుల యూరియాలో ఇప్పటివరకు 22,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. దుకాణదారులు యూరియా, ఎరువులను అధిక ధరకు విక్రయించినా, ఇతర ప్రాంతాలకు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 3, 2025

వార్డు సచివాలయాల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలి: కలెక్టర్

image

వార్డు సచివాలయాల పనితీరును నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్, కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నోడల్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో చెత్త సేకరణతో పాటు రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటిపై వచ్చే సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఐవీఆర్ఎస్ కాల్స్‌లో వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని పేర్కొన్నారు.