News September 2, 2025

MDK: CEIR ద్వారా 1264 ఫోన్లు స్వాధీనం: ఎస్పీ

image

CEIR పోర్టల్ ద్వారా రూ.25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్ల విలువ గల మొత్తం 1264 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫోన్లు తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.

Similar News

News September 2, 2025

చిన్నశంకరంపేట: అనుమానాస్పదంగా వివాహిత మృతి

image

అనుమానాస్పదంగా వివాహేత మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేటలో మంగళవారం జరిగింది. ఎస్సై నారాయణ తెలిపిన వివరాలిలా.. మండల కేంద్రానికి చెందిన వానరాశి రాధిక(19) ఇంట్లో అనుమానాస్పదంగా ఉరేసుకుంది. స్థానికుల సమచారంతో 108 సిబ్బంది మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి అమ్మమ్మ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎస్సై తెలిపారు.

News September 2, 2025

శాశ్వత పరిష్కారం కోసం చర్యలు: కలెక్టర్ రాహుల్ రాజ్

image

భవిష్యత్తులో ‌జిల్లాలో భారీ విపత్తులను అధిగమించే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా ‌నిర్మాణాలు చేపట్టేలా ‌ ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం ‌చేగుంట మండల కేంద్రంలో అనంతసాగర్‌లో వర్షాల తాకిడికి దెబ్బతిన్న ఇళ్లను, ఇబ్రహీంపూర్‌లో తెగిన రోడ్డు, ఇతర నష్టం వాటిల్లగా సంబంధిత రెవెన్యూ, పంచాయతీరాజ్, హౌసింగ్ అధికారులతో పర్యటించారు.

News September 2, 2025

మెదక్: డీవైఎస్ఓ దామోదర్ రెడ్డి బదిలీ.. డీఈఓకే బాధ్యత

image

మెదక్ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి దామోదర్ రెడ్డి మేడ్చల్ జిల్లాకు బదిలీ అయ్యారు. గతేడాది జులైలో బదిలీపై రాగా ఇప్పటి వరకు విధులు నిర్వహించారు. దామోదర్ రెడ్డి బదిలీ కాగా జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌కు డీవైఎస్ఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇన్‌ఛార్జ్ మెదక్ డీఈఓగా ఉన్న ప్రొ.రాధాకిషన్ కు డైట్ ప్రిన్సిపల్ బాధ్యతలు అదనంగా అప్పగించారు. తాజాగా డీవైఎస్ఓగా బాధ్యతలు అప్పగించారు.