News September 2, 2025
ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం: రాహుల్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వమని ప్రతిజ్ఞ చేశారు. తమ శక్తి మేరకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షిస్తామన్నారు. ‘యాత్రను చరిత్రాత్మకంగా మార్చిన ఇండీ కూటమి నేతలు లాలూ ప్రసాద్, తేజస్వీ, దీపాంకర్, ముకేశ్ సాహ్ని, కాంగ్రెస్ శ్రేణులు, రాష్ట్ర యువతకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 22, 2025
ఆయిల్పామ్ సాగులో తెలంగాణ నం.1

ఆయిల్ పామ్ సాగులో TG దేశంలోనే నం.1 స్థానంలో నిలిచింది. దీని సాగు పెంచేలా 2021 నుంచి ఐదేళ్లకు గానూ కేంద్రం 9 రాష్ట్రాలకు 3.22 లక్షల హెక్టార్ల లక్ష్యం నిర్దేశించింది. తమకు నిర్దేశించిన 1.25 లక్షల హెక్టార్లలో 78,869 హెక్టార్లు సాగు చేసి TG ముందులో నిలిచింది. AP 67,727 హెక్టార్లు, ఒడిశా 4946, KA 5088 హెక్టార్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిగతా లక్ష్యం త్వరలో చేరుకుంటామని TG మంత్రి తుమ్మల తెలిపారు.
News September 22, 2025
ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News September 22, 2025
రాష్ట్ర ఉత్సవంగా గురజాడ జయంతి: కొండపల్లి

AP:సమాజంలోని దురాచారాలను తన రచనలతో మార్చిన మహాకవి గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. 150 ఏళ్లైనా ఆయన రచనలు, సాహిత్యం ఇంకా ప్రజాదరణ పొందుతున్నాయని తెలిపారు. గురజాడ జయంతి సందర్భంగా VZMలో ఆయన ఇంటిని సందర్శించిన మంత్రి, MP కలిశెట్టి దాని ఆధునికీకరణ, గ్రంథాలయ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు.