News September 2, 2025
సెప్టెంబర్ 2: చరిత్రలో ఈ రోజు

1956: నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ జననం
1965: భారత తొలి మహిళా రైలు డ్రైవర్ సురేఖ జననం
1968: నటి, రాజకీయ నాయకురాలు జీవిత జననం
1971: నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జననం (ఫొటోలో)
2009: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం(ఫొటోలో)
2022: తెలంగాణ ఉద్యమ నేత మందాడి సత్యనారాయణరెడ్డి మరణం
Similar News
News September 2, 2025
కడపలో స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేశ్

AP: దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సి.కె.దిన్నె MPP హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. కమలాపురం, జమ్మలమడుగు, కడపలో మరో 5 కిచెన్లను వర్చువల్గా ప్రారంభించారు. వీటి ద్వారా 12 వేల మందికి పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. డిసెంబర్ నాటికి కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు భోజనం అందిస్తామని లోకేశ్ ప్రకటించారు.
News September 2, 2025
వెయిట్లిఫ్టింగ్తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్లిఫ్టింగ్ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్ హార్మోన్ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.
News September 2, 2025
ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్సెట్: https://icsil.in/