News September 2, 2025

తొర్రూర్: వైజాగ్ టూర్‌కు స్పెషల్ బస్సు

image

తొర్రూరు పరిసర ప్రాంత ప్రజలు వైజాగ్ యాత్ర స్పెషల్ సర్వీసును వినియోగించుకోవాలని డిపో మేనేజర్ పద్మావతి కోరారు. ఈ బస్సు ఈనెల 12న ఉ.5 గం.కు తొర్రూరు నుంచి బయలుదేరి పరిటాల హనుమాన్ ఆలయం, విజయవాడ కనకదుర్గ గుడి, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, ఆర్కే బీచ్ సందర్శించి 14న ఉదయం తొర్రూరుకు చేరుకుంటుందన్నారు. యాత్ర టికెట్ ధర పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,300గా నిర్ణయించినట్లు తెలిపారు.

Similar News

News September 2, 2025

వెయిట్‌లిఫ్టింగ్‌తో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

మహిళల ఎముకలు, కండరాలు దృఢంగా ఉండాలంటే వెయిట్‌లిఫ్టింగ్ కూడా వ్యాయామంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది బోన్స్‌ను హెల్తీగా ఉంచి ఎముకల సాంద్రతను పెంచుతుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ తర్వాత శరీరంలో ఆక్సిజన్ వినియోగం పెరిగి వర్కవుట్ తర్వాత కూడా ఫ్యాట్ బర్న్ అవుతుంది. అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఎండార్ఫిన్‌ హార్మోన్‌ను విడుదల చేసి మీ మానసిక ఆరోగ్య స్థితిని పెంచుతుంది.

News September 2, 2025

ఇంటర్ అర్హతతో 48 పోస్టులు

image

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ 48 డేటా ఎంట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం గల అభ్యర్థులు ఈ నెల 4వరకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. అభ్యర్థులను షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.590. వెబ్‌సెట్: https://icsil.in/

News September 2, 2025

SRSP UPDATE

image

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు 29 గేట్ల ద్వారా 1.25లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 1.50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 29 వరద గేట్ల నుంచి కాకుండా ఇందిరమ్మ కాల్వ ద్వారా 18 వేలు, కాకతీయ కాల్వ ద్వారా 4500 క్యూసెక్కులు వెరసి మొత్తం 1,51,897 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా 1090 (76.894TMC) అడుగులకు నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.