News September 2, 2025
నవ వధువు ఆత్మహత్య.. వేధింపులే కారణం?

నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గంలో జరిగింది. యువతి రూప (19)కు పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన అనిల్తో 3 నెలల క్రితం వివాహమైంది. శనివారం ఆమె విషద్రావణం తాగగా కుటుంబ సభ్యులు బళ్లారి విమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. భర్త, అత్త వేధింపులతోనే తన కుమార్తె మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News September 2, 2025
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం: కలెక్టర్

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీఐఐసీ కేటాయించిన భూముల్లో నిర్దిష్ఠ సమయంలో పరిశ్రమలు ఏర్పాటు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఆటోనగర్, ఐటీ హిల్స్ వద్ద బస్టాప్లు ఏర్పాటు చేయాలన్నారు. సింగిల్ డెస్క్ ద్వారా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు.
News September 2, 2025
GWL: షీ టీమ్ బృందం నిరంతరం నిఘా: SP

మహిళలు, బాలికల భద్రతకై షీ టీమ్ బృందం నిరంతరం నిఘా ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థల వద్ద ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా షీ టీమ్ నెంబర్ 87126 70312కు కాల్ చేసి సహాయం పొందాలన్నారు. సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. APK ఫైల్స్ ఓపెన్ చేయవద్దని తెలిపారు.
News September 2, 2025
సంగారెడ్డి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నిమజ్జన వేడుకలు డీజే సౌండ్ను నిషేధించినట్లు చెప్పారు. పోలీసుల సూచనలను నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.