News September 2, 2025
ADB: చేసేదే అక్రమ దందా.. ఆపై పబ్లిసిటీ

ఉమ్మడి ADBలో ఇసుక, మొరం అక్రమ దందాకు అదుపు లేకుండా పోయింది. వాగుల్లోంచి ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తుండటం పరిపాటిగా మారింది. పలు మండలాల్లో మొరం దందా కూడా కొనసాగుతోంది. మంచి పేరున్న పలువురు నేతలు అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి అమ్ముకుంటున్నారు. రోడ్లపై కొన్ని గుంతలు పూడ్చి తామే అభివృద్ధి చేశామని చెప్పుకోవడం గమనార్హం. లోకల్ ఎలక్షన్లు వచ్చాయని ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు.
Similar News
News September 2, 2025
GWL: షీ టీమ్ బృందం నిరంతరం నిఘా: SP

మహిళలు, బాలికల భద్రతకై షీ టీమ్ బృందం నిరంతరం నిఘా ఉంటుందని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. రద్దీ ప్రదేశాలు, విద్యాసంస్థల వద్ద ఆకతాయిలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా షీ టీమ్ నెంబర్ 87126 70312కు కాల్ చేసి సహాయం పొందాలన్నారు. సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. APK ఫైల్స్ ఓపెన్ చేయవద్దని తెలిపారు.
News September 2, 2025
సంగారెడ్డి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. నిమజ్జన వేడుకలు డీజే సౌండ్ను నిషేధించినట్లు చెప్పారు. పోలీసుల సూచనలను నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. నిమజ్జన వేడుకలకు అన్ని ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
News September 2, 2025
BREAKING: హిమాయత్ సాగర్లో దూకి యువకుడు సూసైడ్

HYD హిమాయత్ సాగర్ జలాశయంలోకి ఈరోజు ఓ యువకుడు దూకి ఆత్మహత్య చేసుకున్నాడని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు. ఉప్పర్పల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి చెందిన ఆరిఫ్ అందరూ చూస్తుండగానే జలాశయంలోకి దూకాడని చెప్పారు. ఈత రాకపోవడంతో క్షణాల్లోనే యువకుడు మునిగిపోయాడన్నారు. రంగంలోకి దిగిన NDRF బృందాలు యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.