News April 3, 2024

ఏలూరు: నేటి నుంచి ఇంటివద్దనే పింఛన్ల పంపిణీ

image

సామాజిక పింఛన్లను ఈ నెల 3వ తేదీ (నేటి) నుంచి 6వ తేదీ వరకు పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూ ఆయా తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, చక్రాల కుర్చీకి పరిమితమైన వారికి ఇంటి వద్దే పింఛన్లు అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Similar News

News March 22, 2026

పశ్చిమ గోదావరికి రెడ్ అలర్ట్

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వాతావరణ శాఖ ఆదివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

News March 22, 2026

పశ్చిమ గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్

image

కలెక్టర్ చదలవాడ నాగరాణి చొరవతో పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.30 కోట్లతో “మీ ఇంటికి – మీ డాక్టర్” సేవలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నాడు నరసాపురం మండలంలోని 18 గ్రామాల్లో ఈ మొబైల్ మెడికల్ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఈ వ్యాన్‌లో డాక్టర్లు, నర్సుల బృందం నేరుగా గ్రామాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. రెడ్ క్రాస్ సేవల విస్తరణలో భాగంగా మన జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపికైంది.

News March 22, 2026

ప.గో: తినీ తినక కిస్తీలు కడుతున్నాం.. మా ఇళ్లు మాకు ఇవ్వండి!

image

సొంతింటి కల నెరవేరుతుందని ఏళ్లుగా ఎదురుచూస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు నిరాశే మిగులుతోంది. దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ గడువు పొడిగిస్తున్నారే తప్ప ఇళ్లను అప్పగించడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఒకవైపు బ్యాంకులకు ఈఎంఐలు చెల్లిస్తూ, మరోవైపు అద్దె ఇళ్ల భారం మోయలేక తిని తినక కాలం వెళ్లదీస్తున్నామని వాపోతున్నారు. తక్షణమే ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.