News April 3, 2024

KNR కాంగ్రెస్ MP టికెట్‌పై ఉత్కంఠ!

image

KNR MPఅభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ అడుగులేస్తోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ KNR విషయంలో జాప్యం చేస్తోంది. ప్రజలతో సత్సంబంధాలతో పాటు.. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా.. మరో కొత్త అభ్యర్థిని సైతం వెతుకుతున్నట్లు సమాచారం.

Similar News

News October 28, 2025

కురిక్యాల ఘటనపై MLA సత్యం సీరియస్

image

గంగాధర మండల కురిక్యాల ZPHSలోఅటెండర్ యాకుబ్ పాషా విద్యార్థినుల పట్ల ప్రవర్తించి తీరుపై MLA మేడిపల్లి సత్యం సీరియస్ అయ్యారు. పాఠశాలలో జరిగిన సంఘటనపై ఆరా తీసి, అధికారులు, స్కూల్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికాలంగా పాఠశాలలో విద్యార్థినులపై వేధింపులు జరుగుతున్నా చోద్యం చూస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్, సీపీతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 28, 2025

హుజూరాబాద్: జమ్మికుంట రహదారిపై కొండచిలువ

image

హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రహదారి వద్ద సోమవారం రాత్రి కొండచిలువ కనబడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కొండచిలువ కన్పించడంతో జనం గుమిగూడరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుజూరాబాద్‌కు చెందిన పాములు పట్టే అఫ్జల్ ఖాన్‌ను పిలిపించారు. అతడు దానిని పట్టి క్షేమంగా దూరంగా గుట్టల్లో వదిలేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.

News October 28, 2025

కరీంనగర్: ఉరివేసుకొని రాజస్థాన్‌ కూలి మృతి

image

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ కూలి ఉరివేసుకుని మృతి చెందాడు. సీఐ కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కి చెందిన బూర రామ్ గ్రామంలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కిరాయికి ఉంటున్న ఇంట్లోని ఇనుప పైపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.