News September 2, 2025
తల్లి అనారోగ్యానికి గురైతే బిడ్డకు పాలివ్వొచ్చా?

పుట్టిన బిడ్డకు 6నెలలు వచ్చే వరకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలి. అయితే తల్లి అనారోగ్యానికి గురైతే పాలివ్వొచ్చా అని చాలామందికి సందేహం ఉంటుంది. తల్లికి సీజనల్ వ్యాధులు సోకినా బిడ్డను దూరంగా ఉంచకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే నవజాత శిశువుకు తల్లి పాలు ఇవ్వడం ముఖ్యం. అవి బిడ్డకు రోగనిరోధకశక్తిని ఇస్తాయి. తల్లిజ్వరం బిడ్డకు సోకదు. అయితే ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి.
Similar News
News September 22, 2025
TODAY HEADLINES

* రేపటి నుంచి GST ఉత్సవ్: ప్రధాని మోదీ
* 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్నాథ్
* రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి
* నేను సినిమా ప్రేమికుడిని: పవన్
* కనీసం ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి పంపు జగన్: హోంమంత్రి అనిత
* ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్
* కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్హౌస్ సెక్రటరీ
* 25న AP డీఎస్సీ అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ
News September 22, 2025
‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.
News September 22, 2025
నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.