News September 2, 2025

వరంగల్ మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా..!

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) రూ.2,320 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ.6,610, పచ్చి పల్లికాయకు రూ.4,480 ధర వచ్చింది. కాడి పసుపు రూ.10,889, పసుపు గోల రూ.10,629, 5531 రకం మిర్చి రూ.13,500 ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.

Similar News

News September 3, 2025

TODAY HEADLINES

image

* తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు: రేవంత్
* టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా విశాఖ: చంద్రబాబు
* రైతులను చంద్రబాబు గాలికొదిలేశారు: జగన్
* క్రీడాకారుల కోసం ప్రత్యేక సిలబస్: లోకేశ్
* BRS నుంచి కవిత సస్పెండ్
* సీబీఐకి సుగాలి ప్రీతి కేసు
* భారీగా పెరిగిన బంగారం ధరలు

News September 3, 2025

HNK: జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్..

image

✓ పరకాల రక్తపుటేరుకు 78 ఏళ్లు!
✓ JN: మైనర్లకు వాహనం ఇస్తే లక్ష రూపాయల జరిమానా
✓ కాజీపేట: చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
✓ HNK: గంజాయి పట్టుకున్న పోలీసులకు రివార్డులు
✓ ఆఫర్ల కోసం APK ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు: WGL సైబర్ పోలీస్
✓ గణేష్ మండపాల వేదికగా సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన సదస్సులు
✓ గణేష్ శోభాయాత్రలో డీజేలపై నిషేధం: ASP

News September 3, 2025

జమ్మికుంట: రైలు నుండి పడి వ్యక్తి మృతి

image

పెద్దపల్లి(D) పాలకుర్తి మం. కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్‌(33) రైలు నుంచి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో JMKT-బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.