News September 2, 2025

ఓన్లీ కాలింగ్ ప్లాన్ తెచ్చేలా ఆదేశించొచ్చుగా!

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని బ్యాంకులు జీరో-బ్యాలెన్స్ ఖాతాలను అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అదేవిధంగా TRAI కూడా అన్ని టెలికం కంపెనీలకు ఓన్లీ కాలింగ్ రీఛార్జ్ ప్యాక్ అందుబాటులో ఉంచాలని ఆదేశించాలని నెటిజన్లు కోరుతున్నారు. డేటా అవసరం లేకపోయినా చాలామంది సీనియర్ సిటిజన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నారని, రూ.100తో ఓన్లీ కాలింగ్ ప్లాన్ తీసుకొస్తే బాగుంటుందని డిమాండ్ నెలకొంది. మీరేమంటారు?

Similar News

News September 22, 2025

పాక్‌పై టీమ్ ఇండియా విజయం

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం. తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

News September 22, 2025

TODAY HEADLINES

image

* రేపటి నుంచి GST ఉత్సవ్: ప్రధాని మోదీ
* 2039లోనూ బీజేపీ పీఎం అభ్యర్థి మోదీనే: రాజ్‌నాథ్
* రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి: భట్టి
* నేను సినిమా ప్రేమికుడిని: పవన్
* కనీసం ఎమ్మెల్యేలనైనా అసెంబ్లీకి పంపు జగన్: హోంమంత్రి అనిత
* ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్
* కొత్త వారికే H1B వీసా ఫీజు పెంపు: వైట్‌హౌస్ సెక్రటరీ
* 25న AP డీఎస్సీ అపాయింట్‌మెంట్ లెటర్ల పంపిణీ

News September 22, 2025

‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

image

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.