News September 2, 2025
‘కాళేశ్వరం’ అవినీతికి KCR బాధ్యత వహించాల్సిందే: TPCC చీఫ్

TG: కవిత మాటలతో ‘కాళేశ్వరం’లో అవినీతి జరిగినట్లు తేలిపోయిందని TPCC చీఫ్ మహేశ్ అన్నారు. ‘కాళేశ్వరంలో కర్త, కర్మ, క్రియ అన్నీ తానే అని చెప్పుకున్న KCR అవినీతికి కూడా బాధ్యత వహించాల్సిందే. వాటాల పంపకాల్లో తేడాతోనే అంతర్గత కుమ్ములాట జరుగుతోంది. ఎవరి వాటా ఎంతనేది CBI విచారణలో తేలుతుంది. వేగవంతంగా విచారణ చేయకుండా సాగదీస్తే BJP, BRS ఏకమయ్యాయని నిరూపితమవుతుంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 21, 2025
ఈ ఏడాది నవరాత్రుల ప్రత్యేకత ఏంటంటే?

ఈ ఏడాది చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడంతో దుర్గాదేవి శరన్నవరాత్రుల్లో భూమిపైకి ఏనుగు మీద వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఆగమనం అత్యంత శుభప్రదమని అంటున్నారు. ‘అందువల్ల సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. దుర్గమ్మ తన భక్తులను కష్టాల నుంచి విముక్తి చేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది. దీంతో మన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి’ అని సూచిస్తున్నారు.
News September 21, 2025
వీసా ఫీజు పెంపుపై గందరగోళం.. ఆగిన పెళ్లిళ్లు

US H-1B ఫీజు పెంపు నిర్ణయం నిన్న గందరగోళ పరిస్థితులకు దారితీసింది. పెళ్లి కోసం ఇండియాకు వెళ్లాల్సి ఉన్నా మళ్లీ వచ్చేందుకు రూ.80లక్షలు చెల్లించాలనే భయంతో క్యాన్సిల్ చేసుకున్నామని కొందరు SMలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇది అన్యాయం. నేను రాలేకపోతున్నానని తెలిసి మా అమ్మ ఏడ్చేసింది’ అని ఓ యువతి పోస్ట్ చేసింది. కొత్తవారికే ఫీజు పెంపు అని US <<17779352>>క్లారిటీ<<>> ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
News September 21, 2025
మళ్లీ ‘నో హ్యాండ్షేక్’ అవమానం తప్పదా?

Sep14న మ్యాచ్ ముగిశాక భారత ఆటగాళ్లు తమ క్రికెటర్లకు హ్యాండ్షేక్ ఇవ్వకపోవడాన్ని PAK అవమానంగా భావించింది. ఆ వివాదంలోకి రిఫరీ పైక్రాఫ్ట్ను లాగి నిందించింది. అతడిని తొలగించకపోతే UAEతో మ్యాచ్ ఆడబోమని ఉడత బెదిరింపులకు దిగింది. ICC వినకపోవడంతో మ్యాచ్ ఆడేసింది. నేడు అతడే రిఫరీగా INDతో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ‘నో హ్యాండ్షేక్’ అవమానానికి అవకాశం ఉంది. PAK ఈసారి ఎవర్ని నిందిస్తుందో?