News September 2, 2025

జిల్లాలో 24 మందికి కిసాన్ డ్రోన్లు: మంత్రి

image

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కిసాన్ డ్రోన్‌ను జామి మండలం మొక్కాసవలస గ్రామానికి చెందిన లబ్ధిదారుడు కూనిరెడ్డి సత్యనారాయణ మూర్తికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద జిల్లాలో 24 డ్రోన్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు.

Similar News

News September 3, 2025

‘పారదర్శకంగానే DSC అభ్యర్థుల ఎంపిక’

image

2025 డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధించిన ఉపాద్యాయుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో DSCకి ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు రీ వేర్ఫికెషన్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు ఎటువంటి అపోహలు పడొద్దని, అభ్యంతరాలుంటే DEOని సంప్రదించాలన్నారు.

News September 3, 2025

జిల్లాలో ఎరువుల కొరత లేదు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో ఎరువుల‌కు కొర‌త లేద‌ని, ప్ర‌స్తుత పంట‌ల‌కు అవ‌స‌ర‌మైనంత ఎరువుని ఇప్పటికే స‌ర‌ఫ‌రా చేశామ‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ తెలిపారు. వివిధ జిల్లాల క‌లెక్ట‌ర్లు, SPల‌తో CM చంద్ర‌బాబు బుధ‌వారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వ‌హించగా.. జిల్లా పరిస్థితులను కలెక్టర్ వివరించారు. ఇప్ప‌టికే సుమారు 30వేల మెట్రిక్ ట‌న్నుల యూరియాను రైతుల‌కు స‌ర‌ఫ‌రా చేశామని, ఇంకా 37,600 మెట్రిక్ ట‌న్నుల యూరియా అవసరమన్నారు.

News September 3, 2025

9న రైతు నిరసన: చిన్న శ్రీను

image

రైతు సమస్యలపై రెవెన్యూ డివిజన్ల స్థాయిలో ఈనెల 9న రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించ తలపెట్టినట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) పేర్కొన్నారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎరువుల కొరత ఉందని రైతులు చెబుతుంటే కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.